జైపూర్: సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, సచిన్పైలెట్కు సపోర్ట్ చేసిన 19 మంది పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే 19 మందికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ల ఇళ్లకు నోటీసులు అంటించారు. వాళ్లంతా ఎక్కడున్నారో తెలియనందున తప్పించుకునేందుకు వీలు లేకుండా వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపారు. అంతే కాకుండా వాళ్ల నివాసాలకు ఇంగ్లీష్, హిందీల్లో ఉన్న నోటీసులను కూడా అంటించారు. ‘మీటింగ్ గురించి తెలిసి […]