న్యూఢిల్లీ: చైనాను దెబ్బతీసేందుకు మన సైన్యం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కొత్త భాషను నేర్చుకుంటుంది. ఐటీబీపీలోని 90వేల మంది చైనాలో ఎక్కువగా మాట్లాడే మాండరిన్ భాష నేర్చుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక కోర్సును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. లద్దాఖ్లో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో ఐటీబీపీ తమ జవాన్ల కోసం మాండరిన్ కోర్సును నేర్పిస్తున్నారు. మన సైనికులు మాండరిన్ భాషను నేర్చుకుంటే చైనా సైనికులతో నేరుగా మాట్లాడేందుకు వీలుంటుందని, […]
లద్దాఖ్: లద్దాఖ్లోని నార్త్– నార్త్వెస్ట్ కార్గిల్లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. లద్దాఖ్లో 25 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఎన్సీఎస్ చెప్పింది. హిమాయా రీజన్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గతవారం 4.5 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు.
ఢిల్లీ: లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు గాయపడ్డారని సంబంధిత అధికారులు ప్రకటించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. జూన్ 15 అర్ధరాత్రి తర్వాత గాల్వన్ లోయలోని పెట్రోల్ […]