సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.