Breaking News

INTER COLLEGES

గిరిజన గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు

గిరిజన గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశపరీక్ష (టీటీడబ్ల్యూఆర్‌జేసీ) ఫలితాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. రిజల్ట్​ను TGGURKULAM లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫలితాలు పంపిస్తామని చెప్పారు. ప్రవేశ ప్రక్రియ తేదీలు త్వరలోనే ప్రటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 73 గిరిజన గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 7,040 సీట్లు ఉండగా.. వీటిలో ప్రవేశాలకు మార్చి 8న నిర్వహించిన పరీక్షకు 10,052 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Read More