సారథి, హుస్నాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు నీరు లేక ఎండుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. వానాకాలంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా అన్నదాతలు ఆనందంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి పంటలు వేశారని చెప్పారు. పంటలన్నీ పొట్టదశలో ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎండిపోతున్నాయని […]