సారథి న్యూస్, బిజినేపల్లి: ఇటీవల ఒంటరి మహిళలపై గుర్తుతెలియని దుండగులు బైక్లపై వచ్చి గొలుసులు దొంగలించుకుంటున్నారని, వారి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ సూచించారు. మహిళలు రోడ్లపైకి వచ్చినప్పుడు అనుమానాస్పదంగా బైక్లపై చుట్టూ తిరిగే వారిపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. అంతేకాకుండా గ్రామాలు, కాలనీల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాలను అదుపుచేసే క్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించాని కోరారు.