ముంబై: మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనాను జయించారు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో జయాబచ్చన్ మినహా మిగిలిన కుటుంబసభ్యులు అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. కాగా వీరంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవాలంటూ అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు చేశారు. ఈ మేరకు సోమవారం అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ‘మేము కోలుకోవాలని కాంక్షిస్తూ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయి’ […]
ముంబై: బిగ్ అమితాబచ్చన్ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్తోపాటు ఆయన కుమారుడు అభిషేక్, కోడల్ ఐశ్వర్యరాయ్, మనుమరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా అమితాబ్, అభిషేక్ దవాఖానాలో చికిత్స పొందుతుండగా.. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఐశ్వర్యకు కొన్ని లక్షణాలు బయటడపడటంతో ఆమె ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఐశ్వర్యతోపాటు ఆమె కూతురు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.