ముంబై: కరోనా మహమ్మారి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో బిగ్బీ అమితాబ్కు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన జులై 11న ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కానీ అభిషేక్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.