సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలోని కమలాపూర్ కింది తండాకు చెందిన శతాధిక వృద్ధుడు పాపియా నాయక్(110) బుధవారం మృతిచెందాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చనిపోయాడు. శతాధిక వృద్ధుడు మృతి చెందడం పట్ల సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కమలాపూర్ సర్పంచ్ కుంట్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, గ్రామస్తులు, సంతాపం తెలిపారు.
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆదివారం ఓ శతాధిక వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుడైన కొండాపురం హన్మిరెడ్డి(103) 1917 లో జన్మించాడు. అయితే ఎప్పుడు చలాకీగా ఉండే హన్మిరెడ్డి తన పని తాను చేసుకుంటూ హాయిగా ఉండేవాడు. ఈనెల 9న ప్రమాదవశాత్తు కాలు జారిపడి అస్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో మృతిచెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.