సారథి న్యూస్, బిజినేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం డీఈవో గోవిందరాజులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మండలంలోని వట్టెం బాలుర ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయిని కల్పనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.భాస్కర్రెడ్డి, టీచర్లు ఝాన్సీ, సురేష్ పాల్గొన్నారు.