Breaking News

రాజన్న

రాజన్నసన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాజన్నసన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సారథి, వేములవాడ: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ ఈవో, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు. వసతిగృహాల ప్రారంభంవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా […]

Read More
రాజన్న సన్నిధిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్​

రాజన్న సన్నిధిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్​

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాష్టీయస్వయంసేవక్​సంఘ్ అఖిల భారతీయ గ్రామవికాస్ సహ ప్రముఖ గురురాజాజీ, పద్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయఅర్చకులు, వేదపండితులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి అభిషేకం లడ్డూ, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందు పరిషత్ సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు, భజరంగ్ దళ్ ప్రముఖ్ యశ్వంత్ ఉన్నారు.

Read More
రాజన్న సన్నిధిలో మాధవానందస్వామి

రాజన్న సన్నిధిలో మాధవానందస్వామి

సారథి, వేములవాడ: దక్షిణకాశీ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తొగుట పీఠం శ్రీశ్రీశ్రీ మాధవానందస్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి పూజల అనంతరం కల్యాణమండపంలో పాదపూజ చేశారు. వారి వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, అర్చకస్వాములు పాల్గొన్నారు. అలాగే ఒకేరోజు సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయానికి రూ.20లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Read More
రాజన్న సన్నిధిలో ప్రముఖులు

రాజన్న సన్నిధిలో ప్రముఖులు

సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సినీనేపథ్య గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరస్వాగతం పలికారు. శాలువతో సన్మానం చేసి స్వామి వారి అభిషేకం లడ్డూప్రసాదంతో పాటు స్వామివారి ప్రతిమలను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు.

Read More