సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్(ssc) ఫలితాల కోసంwww.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inవెబ్సైట్లో సంప్రదించాలని కోరారు.