సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని అన్ని గ్రామాల మసీద్ కమిటీ సభ్యులతో ఎస్సై టి.వివేక్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి గోవధకు పాల్పడొద్దని సూచించారు. అందరూ కలిసి స్నేహపూర్వకంగా బక్రీద్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ఎస్సై టి.వివేక్ కోరారు.