Breaking News

కెనాల్

శభాష్​ పోలీస్​

సారథి న్యూస్​, గోదావరిఖని: పొలాల్లో గడ్డికి మంటలు అంటుకోవడంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై రాజేష్ కానిస్టేబుల్​ తిరుపతితో కలిసి చాకచక్యంతో ఆర్పివేశారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సుల్తానాబాద్ మున్సిపల్​ పట్టణ శివారులోని పెద్ద కెనాల్ పరిసర పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు కి.మీ.మేర వ్యాపించాయి. రోడ్డుపై అటుగా వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్​, స్థానికుల సహాయంతో గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. సమీపంలో కోళ్లఫారాలు ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Read More