ముంబై: మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనాను జయించారు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో జయాబచ్చన్ మినహా మిగిలిన కుటుంబసభ్యులు అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. కాగా వీరంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవాలంటూ అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు చేశారు. ఈ మేరకు సోమవారం అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ‘మేము కోలుకోవాలని కాంక్షిస్తూ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయి’ […]
ప్రస్తుతం ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా సోకడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్ మూత్రపిండాల నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రిపోర్ట్స్లో బిగ్బీకి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. […]