సారథి న్యూస్, హైదరాబాద్: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియాకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పర్యవేక్షించాలని సూచించారు.