Breaking News

మెహ్రీన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

మెహ్రీన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

సామాజిక సారథి, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాంలెజ్‌లో సినీనటి మెహ్రీన్‌ ఫిర్జాదా పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్‌ అందించేందుకు, గ్రీన్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెహ్రీన్‌ పిలుపునిచ్చారు. మెహ్రీన్‌కు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందించారు. ఇక మెహరీన్‌ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ఈ అమ్మడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్‌3’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వచ్చిన ‘ఎఫ్‌2 సినిమాలో హానీ ఈస్‌ ద బెస్ట్‌’ అంటూ నవ్వులు పూయించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ భామ. అలాగే కన్నడలో ఓ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ.