బాలీవుడ్ డేరింగ్ బ్యూటీ, వివాదాస్పద నటిపై ఇప్పడు సోషల్మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై స్పందించే కంగనా రనౌత్ యూపీలోని హథ్రాస్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనను ఎందుకు ఖండించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘సుశాంత్, డ్రగ్స్కేసులో తీవ్రంగా స్పందించిన కంగనా ఇప్పుడెందుకు సైలంట్ అయ్యింది’ అంటూ ఓ నెటిజన్ల సోషల్మీడియాలో కామెంటు చేశారు. ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా చాలా మంది కంగనాను టార్గెట్ చేశారు.
కంగన బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది కాబట్టి కంగనా నోరు మెదపడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.
- October 6, 2020
- Archive
- Top News
- జాతీయం
- BOLLYWOOD
- HATHRAS
- HYDERABAD
- KANGANA
- TOLLYWOOD
- UTTARPRADESH
- టాలీవుడ్
- తెలంగాణ
- బాలీవుడ్
- హైదరాబాద్
- Comments Off on ‘హథ్రాస్’ పై మాట్లాడవేం! కంగనాపై నెటిజన్ల ఫైర్