Breaking News

‘హథ్రాస్’​ పై​ మాట్లాడవేం! కంగనాపై నెటిజన్ల ఫైర్​

బాలీవుడ్​ డేరింగ్​ బ్యూటీ, వివాదాస్పద నటిపై ఇప్పడు సోషల్​మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై స్పందించే కంగనా రనౌత్​ యూపీలోని హథ్రాస్​ జిల్లాలో ఓ మైనర్​ బాలికపై జరిగిన దారుణ ఘటనను ఎందుకు ఖండించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘సుశాంత్​, డ్రగ్స్​కేసులో తీవ్రంగా స్పందించిన కంగనా ఇప్పుడెందుకు సైలంట్​ అయ్యింది’ అంటూ ఓ నెటిజన్ల సోషల్​మీడియాలో కామెంటు చేశారు. ప్రస్తుతం ఫేస్​బుక్​, వాట్సాప్​ వేదికగా చాలా మంది కంగనాను టార్గెట్​ చేశారు.
కంగన బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది కాబట్టి కంగనా నోరు మెదపడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.