Breaking News

మతోన్మాదం రెచ్చగొడుతున్న బీజేపీ

మతోన్మాదం రెచ్చగొడుతున్న బీజేపీ
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సామాజికసారథి, హైదరాబాద్‌: దేశంలో మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అనే విధంగాపరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన చట్టాలను వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రశ్నించాల్సిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయ శక్తులతో పాటు అన్నిరంగాల వారు పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్మికులు వ్యవసాయ రంగానికి జరిగే అన్యాయాలనే కాకుండా రాజకీయంగా జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు.