Breaking News

9 మంది మృత్యువాత

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 174 కి చేరింది. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 164 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో 133 కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,484కు చేరింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు చొప్పున, సంగారెడ్డి జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో మూడు, మహబూబ్​ నగర్​, కరీంనగర్​, ములుగు జిల్లాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రుల్లో 2,032 మంది చికిత్స పొందుతున్నారు.