సామాజికసారథి, బిజినేపల్లి: బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామ సమీపంలో ఐ10 కారు(TS 06E6155) శుక్రవారం అర్ధరాత్రి బోల్తాపడింది. అందులో ఉన్న ఎక్సైజ్జూనియర్ అసిస్టెంట్ పుట్టపాగ రాము అక్కడికక్కడే మృతిచెందాడు. జొన్నలబొగడ గ్రామానికి చెందిన పుట్టపాగ రాజు నాగర్కర్నూల్ ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. నాగర్కర్నూల్ నుంచి జడ్చర్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్లో ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి ఇంటి యజమానితో పాటు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతులు యజమాని శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక(23), ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు.. మరో బంధువైన శాంతయ్యగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల […]