Breaking News

Month: July 2021

ఎంపీటీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్దాం

సీఎం దృష్టికి ఎంపీటీసీల సమస్యలు

సారథి, హైదరాబాద్: హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని పలు తీర్మానాలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను కలిసి సీఎం కేసీఆర్ ​వద్దకు వెళ్లి తమ సమస్యలను విన్నవించాలని, అన్ని జిల్లాల్లో కలెక్టర్ లకు వినతిపత్రం ఇవ్వాలని, ఆగస్టులో హైదరాబాద్ లో ఎంపీటీసీల సభ […]

Read More
మొక్కలు పంపిణీ

మొక్కలు పంపిణీ

సారథి, కొల్లాపూర్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో జిల్లా అడిషనల్​కలెక్టర్ మనుచౌదరి, చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి శుక్రవారం పట్టణంలోని 20వ వార్డులో మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి పనులపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్యసిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Read More
బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన

బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన

సారథి, చొప్పదండి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు చొప్పదండి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొలిమికుంట గ్రామంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండలాధ్యక్షుడు మొగిలి మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భర్తీచేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నింపాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు […]

Read More
కృష్ణానీటిని అక్రమంగా తరలించొద్దు

కృష్ణానీటిని అక్రమంగా తరలించొద్దు

సారథి, కొల్లాపూర్: కృష్ణానది నీటిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాను జయప్రదం చేయడానికి కొల్లాపూర్ నుంచి సీపీఐ నాయకులు బయలుదేరారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య మహిళా కార్యదర్శి ఇందిర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిరణ్, జిల్లా సమితి నాయకులు కురుమయ్య, కొల్లాపూర్ టౌన్ కార్యదర్శి ఎండీ యూసుఫ్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు సత్యం, వెంకటాచలం, శీను, గంగన్న, హరికురుమయ్య, ఎల్లయ్య, వెంకటమ్మ, చిన్నమ్మ, కురుమయ్య, చెన్నకేశవులు, ఎం.నరసింహ, […]

Read More
కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు..

కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు..

570 టీఎంసీల నీటివాటా రాకుండా సంతకాలు సమస్యల పరిష్కారానికి ఆగస్టు 9 నుంచి పాదయాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సారథి, కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది జలాల నుంచి 570 టీఎంసీల నీటివాటా రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్, చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీల నీటివాటా కోసం సంతకాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ ఫొటోలు తగిలించుకొని […]

Read More
జులై 11న గురుకుల యూజీ ఎంట్రెన్స్​టెస్ట్‌

జులై 11న గురుకుల యూజీ ఎంట్రెన్స్​ టెస్ట్‌

సారథి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (టీజీయూజీసెట్‌-2021) జులై 11న జ‌ర‌గ‌నుంది. 2021-22 విద్యాసంవ‌త్సరానికి గాను తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ ​అండ్ ట్రైబ‌ల్ వెల్ఫేర్​ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో మొద‌టి ఏడాది ప్రవేశానికి జులై 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీజీయూజీసెట్ క‌న్వీన‌ర్ డాక్టర్​ఆర్‌ఎస్‌ ప్రవీణ్​కుమార్​రాష్ట్రంలోని ఆయా కేంద్రాల్లో ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష […]

Read More
108, 102 వాహనాల తనిఖీ

108,102 వాహనాల తనిఖీ

సారథి, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో జీవీకే 108 అంబులెన్స్ లు, 102 అమ్మఒడి వాహనాలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కోరట్ల వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని వైద్యపరికరాల పనితీరును పరిశీలించారు. వాహనంలో నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కరోనా పేషెంట్లను తరలించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోగిని తరలించిన వెంటనే శానిటైజేషన్​చేయాలని ఆదేశించారు. అమ్మఒడి వాహనాల ద్వారా కొవిడ్ […]

Read More
రేవంత్​ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

సారథి, పెద్దశంకరంపేట/గొల్లపల్లి/రామడుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమానికి తరలిన వారిలో రాయిని మధు, జనార్ధన్, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, నారాగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, సాయిరెడ్డి, రఘుపతిరెడ్డి, రాంచందర్, […]

Read More