సారథి, రామడుగు: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల దోపిడిని అరికట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల రైతులు సోమవారం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద వరిధాన్యాన్ని తగలబెట్టి ఆందోళనకు దిగారు. అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటకు కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు క్వింటాలుకు 3కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకొవట్లేదని రైతులు వాపోతున్నారు. రైతులు చేస్తున్న ఆందోళన వద్దకు తహసీల్ధార్ కొమాల్ రెడ్డి, […]
ఫ్యాన్గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు మిన్నంటిన వైఎస్సార్సీపీ సంబరాలు తిరుపతి: తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ […]
ఐదేళ్లకోసారి సంప్రదాయ అధికారమార్పిడికి చెక్ రెండోసారి అధికారంలోకి ఎల్ డీఎఫ్ 1980 తర్వాత అధికారపార్టీ విజయం తిరువనంతపురం: గతంలో లేని విధంగా ఈ సారి కేరళ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. దేవభూమిలో ఎలాగైనా పాగా వేయాలని కాషాయదళం సర్వశక్తులూ ఒడ్డింది. తామే అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అలాగే సంప్రదాయ అధికార మార్పిడిలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారే […]
టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి డిపాజిట్ దక్కించుకోని బీజేపీసారథి, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కారు జోరు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18వేల పైచిలుకు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. దీంతో జానారెడ్డి వరుసగా మూడోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ సైతం దక్కలేదు. ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు భగత్ కుమార్ టీఆర్ఎస్ తరపున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం నూతన ఎస్సైగా తాండ్ర వివేక్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భౌతికదూరం, మాస్కులు, సానిటైజర్లు తప్పకుండా వాడాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లుకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలో ఎవరైన అసాంఘిక కార్యక్రమాలు, గ్రామాల్లో కొత్తవ్యక్తులు సంచరిస్తే తమకు లేదా […]
బెంగాల్ దంగల్ లో దీదీ విజయం ఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీ తమిళనాడులో డీఎంకే జయకేతనం కేరళలో రెండోసారి విజయన్ సర్కారు అసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్డీఏ న్యూఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లను కైవసం చేసుకుంది. దీదీ సారథ్యంలో తీన్ మార్ మోగించింది. ఏకంగా అధికారాన్ని చేపడతామని గొప్పలు చెప్పిన కాషాయదళం మమతా బెనర్జీ ఎత్తుల ముందు బోల్తాపడింది. మార్చి 27 […]
చెపాక్ నుంచి నాడు కరుణానిధి నేడు ఉదయనిధి స్టాలిన్ గెలుపు చెన్నై: డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం సాధించారు. స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి, ఏఐఎడీఎంకే అభ్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలిచారు. 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 156 స్థానాల్లో డీఎంకే విజయం ఖాయం చేసుకుంది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో […]
* సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ లో సెటైర్లు సారథి, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై రోజుకో రకంగా సెటైర్లు విసురుతూ వార్తల్లోకి ఎక్కుతొంది. సీఎం కేసీఆర్ ఆరోగ్యశాఖ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాకా తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతలుండవని ఘాటుగా విమర్శించారు. కొత్త వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కేసీఆర్ అంటూ ఓ వైపు శుభాకాంక్షలు చెప్పుతునే, మరోవైపు జ్వరం […]