క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొగల్ సామ్రాజ్యపు రోజులను ప్రతిబింబించేదిగా ఉంటుదట ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో దేశానికి కాబోయే రాణి.. యువరాణిగా పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోందట. యువరాణిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో తను ఆకస్మాత్తుగా చనిపోతుందట. సినిమాలో ఈ ఎమోషన్ సీన్లకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోయే ఈ చిత్రం మొఘలుల కాలంలో అత్యంత ఖరీదైన […]
సారథి న్యూస్, గద్వాల: కర్ణాటకలోని నారాయణ్ పూర్ డ్యాం నుంచి కృష్ణానది నీటిని ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. రెండుగేట్లను ఒక మీటర్ పైకి ఎత్తి 11,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలు జూరాల వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను నింపి తెలంగాణలోని ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమయ్యాయి. ఆల్మట్టి జలశయానికి ఎగువ నుంచి 69వేల […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉత్తరాంధ్ర.. గోదావరి తీరంలో మకుటం లేని మహారాజులు. రాజ్యాలు పోయినా రాజభోగాలు అలాగే ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా రాజుల వారసులను తమ రాజకీయ ప్రాభవానికి మెట్లుగా వాడుకుని వారికి సింహాసనం కట్టబెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రాజుల మధ్య వారసత్వపోరు అనుకోండి.. అహం దెబ్బతినడం వల్ల కావచ్చు.. రచ్చ మొదలైంది. ఇది గతంలో ఎన్నడూలేనంతగా అంతర్గత యుద్ధంగా పరిగణించడమే ఇందుకు కారణం.. సింహాచల చైర్మన్ గిరీ అశోకగజపతిరాజు నుంచి సంచయితకు చేరడం […]
ముంబై: కరోనా మహమ్మారి బాలీవుడ్ సినీప్రముఖులను వణికిస్తున్నది. ఇప్పటికే బిగ్బీ అమితాబ్బచ్చన్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా సోకగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణనటుడు అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అనుపమ్ తల్లికి, అతడి సోదరుడికి మరో ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయన్ని స్వయంగా అనుపమ్ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు’ […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్క్ ధరించి ప్రత్యక్షమయ్యాడు. తాజాగా వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్రీడ్ మిలటరీ దవాఖానను సందర్శించిన ఆయన మాస్కును ధరించాడు. అమెరికాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ట్రంప్ మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోరంటూ మీడియా ప్రశ్నించిన ప్రతిసారి.. ఎదురు దాడికి దిగేవారు. ఈ క్రమంలో తొలిసారిగా మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు మాస్క్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. […]
ప్రస్తుతం ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా సోకడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్ మూత్రపిండాల నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రిపోర్ట్స్లో బిగ్బీకి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. […]
కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలోకి 15 అడుగుల భారీ తాచుపాము వచ్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని కొందరు యువకులు ఆ పామును చంపేందుకు యత్నించగా వారికి చిక్కలేదు. దీంతో అటవీఅధికారులను సమాచారమిచ్చారు. అధికారులు గ్రామానికి చేరుకొని ఆ పామును సజీవంగా బంధించారు. అనంతరం సమీపంలోని సిరువాని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ముంబై: కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ అగ్రనటుడు, బిగ్బీ అమితాబ్కు, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే అమితాబచ్చన్ ఓ టీవీషోకు సంబంధించిన ఆడిషన్ నిర్వహిస్తున్నప్పుడు అతడికి కరోనా సోకిఉంటుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకొనే అమితాబచ్చన్కు కరోనా ఎలా సోకిందనని ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఎక్కడికెళ్లినా మాస్క్, చేతులకు గ్లౌజ్ ధరించేవారు. శానిటైజర్ బాటిల్ కూడా వెంట […]