Breaking News

17వేల మార్క్​ దాటిన కరోనా

17వేల మార్క్​ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకేరోజు 1018 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు పాజిటివ్​కేసులు 17,357 నమోదయ్యాయి. ఇప్పటివరకు యాక్టివ్​కేసులు 9008 ఉన్నాయి. తాజాగా 8082 మంది రోగులు డిశ్చార్జ్​ అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి ఏడుగురు మృతి, ఇప్పటివరకు 267 మంది మృత్యువాతపడినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులిటెన్​ను పేర్కొంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో 881 కేసులు, రంగారెడ్డి 33, మేడ్చల్​జిల్లాలో 36, మహబూబ్​నగర్​జిల్లాలో 10 చొప్పున పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి.