Breaking News

1,554 కేసులు.. 9 మరణాలు

1,554 కేసులు.. 9 మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తంగా రాష్ట్రంలో 49,259కు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 37,666 కేసులు నమోదయ్యాయి. తాజాగా 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 429 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ 842 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 132, మేడ్చల్​ 96, సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్​ అర్బన్​ 38, వరంగల్​ రూరల్​ 36, కరీంనగర్​ 73, మహబూబాబాద్​ 11, పెద్దపల్లి 23, మెదక్​ 25, మహబూబ్​ నగర్​ 14, నల్లగొండ 51, రాజన్న సిరిసిల్ల 18, నాగర్​కర్నూల్​ 14, నిజామాబాద్​ 28, వనపర్తి 21, సూర్యాపేట 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​ బులెటిన్​ విడుదల చేసింది.