Breaking News

స్వచ్ఛతకే ప్రాధాన్యం

సారథిన్యూస్​, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేంర్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె మెదక్ ​జిల్లా నిజాంపేట మండలకేంద్రంతోపాటు మండలపరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్, చల్మేడ గ్రామాలలో డంప్ యార్డ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్​ వైరస్ ను తరిమి కొట్టాలంటే ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇందిరా, జెడ్పీటీసీ విజయ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, రమాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.