Breaking News

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీవరద

సారథిన్యూస్​, మహబూబ్​నగర్​: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2,10,420 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 2,52,459 క్యూసెక్కులను దిగవకు వదలుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు కాగా ప్రాజెక్టులో 210.9946 టీఎంసీలుగా నీరు ఉన్నది. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్​ కేంద్రంలో విద్యుత్​ ఉత్పత్తి కొససాగుతున్నది.