Breaking News

వెయ్యి దాటిన కరోనా మరణాలు

వెయ్యి దాటిన కరోనా మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వెయ్యి మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో (24 గంటల్లో) 2,159 పాజిటివ్ ​కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,005 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరింది. తాజాగా వ్యాధి నుంచి 2,108 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,33,555కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్​కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 318 కేసులు నిర్ధారణ అయ్యాయి.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ ​20, భద్రాద్రి కొత్తగూడెం 60, జగిత్యాల 45, జనగామ 35, జయశంకర్​ భూపాలపల్లి 22, కామారెడ్డి 49, కరీంనగర్ ​127, ఖమ్మం 77, మహబూబ్​నగర్ ​24, మహబూబాబాద్ ​84, మంచిర్యాల 33, మేడ్చల్ ​మల్కాజిగిరి 121, నాగర్​కర్నూల్​ 27, నల్లగొండ 141, నిర్మల్ ​29, నిజామాబాద్ ​84, పెద్దపల్లి 47, రాజన్న సిరిసిల్ల 53, రంగారెడ్డి 176, సంగారెడ్డి 64, సిద్దిపేట 132, సూర్యాపేట 66, వికారాబాద్ ​22, వనపర్తి 23, వరంగల్ ​రూరల్ ​39, వరంగల్ అర్బన్ ​98, యాదాద్రి భువనగిరి 46 చొప్పున పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.