Breaking News

విద్యుత్​షాక్​తో యువకుడు మృతి

సారథి న్యూస్​, గద్వాల: విద్యుత్​షాక్​తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో చోటుచేసుకున్నది. యువకుడు తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా.. పొలం వద్ద ట్రాన్స్​ఫారం పోయింది. దీంతో లైన్​ ఆఫ్​చేసి జంపర్​ వేస్తుండగా ప్రమాదవశాత్తు మెయిన్​వైర్​కు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.