![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/KALYAN-BABUUFF.jpg?fit=700%2C394&ssl=1)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్కల్యాణ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్కల్యాణ్ భారీ కటౌట్ కడుతుండగా సోమశేఖర్, అరుణాచలనం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్షాక్తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు నాడు ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. గాయపడ్డవారికి జనసేన పార్టీ తరఫున చికిత్స అందజేస్తామని చెప్పారు.