Breaking News

లారీతో తొక్కించి చంపుతామంటున్నారు

సారథిన్యూస్​, అమరావతి: జగన్​ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్​సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్​ చేయడం వెనక కొడాలి నాని పాత్ర ఉందని ఆరోపించారు. ఈఘటనపై ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. సీబీఐ ఎంక్వైరీ నిర్వహించాలని డిమాండ్​ చేశారు.