Breaking News

రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దెదింపుదాం

సారథిన్యూస్, రామగుండం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయని రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చని రైలు బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం స్థానిక దుర్గ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, కార్పొరేటర్లు, అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం లో కార్పొరేటర్లు, నాయకులు మంగళ స్వామి, పెద్దెల్లి ప్రకాష్, ఏం డి,ముస్తఫా, గాదం విజయ, నందు, గట్ల రమేష్, యుగంధర్, నజాముద్దీన్, బెంద్రం, రాజా రెడ్డి, సప్న, సుజాత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.