Breaking News

రియాతో స్నేహం​.. రకుల్​ కొంపముంచిందా!

బాలీవుడ్​ డ్రగ్స్​కేసు రోజుకో కీలకమలుపు తిరుగుతున్నది. ఈ క్రమంలో ఈ కేసులో టాలీవుడ్​ హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. రకుల్​తో పాటు మహేశ్​బాబు సతీమణి నమ్రత పేరు కూడా డ్రగ్స్​ కేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని రకుల్ చెప్పినప్పటికీ ఎన్​సీబీ మాత్రం ఆమెకు నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రకుల్​ ఎన్​సీబీ ఎదుట హాజరైంది. అయితే రియా చక్రవర్తితో స్నేహం చేయడమే రకుల్​ కొంపముంచినట్టు సమాచారం. ప్రస్తుతం రియా, రకుల్​ మధ్య జరిగిన వాట్సప్​ సంభాషణలు.. వారు డ్రగ్స్​ విషయంపై మాట్లాడుకున్న మాటలు కీలకంగా మారాయి. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్​ నటి దీపికా పదుకొనే, సారా అలీఖాన్​తో పాటు శ్రద్ధా కపూర్​ పేర్లు కూడా వినిపించాయి. అయితే రియా చక్రవర్తి చెప్పిన లిస్ట్​ చాలా పెద్దదని మొత్తం 78 మందికి పైగా ఈ కేసులో ఉన్నట్టు సమాచారం. అయితే ఇంతవరకు ఏ హీరో పేరు కూడా డ్రగ్స్​కేసులో బయటకు రాలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.