Breaking News

రవితేజ పాటను.. యాజ్​ ఇ టీజ్​ దించేశారుగా!

రవితేజ నటించిన ఇడియట్​ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ కాపీ కొట్టాడు. ట్యూన్​ను యాజ్​ ఇ టీజ్​గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్​అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్​ బుధవారం ఓ పాటను విడుదల చేసింది. ‘హసీనా పాగల్ దివాని’ అంటూ సాగే సాంగ్‌లో కైరాతో పాటు ఆదిత్య సియల్ కనిపిస్తున్నారు. టీ సిరీస్ యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా రిలీజ్ అయిన‌‌ విడుదలేన ఈ పాట .. మన తెలుగుపాటకు కాపీ కావడం గమనార్హం. ఏంటి మన తెలుగు పాటలను కూడా బాలీవుడ్​ టెక్నిషియన్స్​ కాపీ చేస్తున్నారా.. అంటూ కామెంట్లు పెడతున్నారు నెటజన్లు.

One thought on “రవితేజ పాటను.. యాజ్​ ఇ టీజ్​ దించేశారుగా!”

Comments are closed.