Breaking News

యాసంగిలో ఏం సాగుచేద్దాం

యాసంగిలో ఏం సాగుచేద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకుంటారు. గతేడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు? వాటికి ఎంత ధర వచ్చింది? తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆ​దేశించారు. యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారు.