Breaking News

మోతె రిజర్వాయర్​కు మోక్షం

సారథి న్యూస్, రామడుగు: మోతె రిజర్వాయర్​కు ఎట్టకేలకు అనుమతి లభించింది. పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో నిర్మిస్తున్న మోతె రిజర్వాయర్​కు గతేడాది జూన్​లో టెండర్లు పిలిచారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. రూ.180కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో దాదాపు 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవిశంకర్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.