Breaking News

బీజేపీ స్టేట్ ​కమిటీ నియామకం

బీజేపీ స్టేట్​కమిటీ నియామకం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడేందుకు ప్లాన్ ​చేస్తోంది. అందుకు అనుగుణంగా కమిటీలను నియమిస్తోంది. సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​కుమార్​ ఆదివారం పూర్తి కమిటీని ప్రకటించారు. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జి.మనోహర్​రెడ్డి, బండారు శోభారాణిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి ప్రధాన కార్యదర్శులుగా నియమితుయ్యారు. రఘునందన్ రావు, కుంజా సత్యవతి, పల్లె గంగారెడ్డి, డాక్టర్​ ప్రకాశ్​రెడ్డి, ఎం.శ్రీనివాస్​గౌడ్, బొమ్మ జయశ్రీ, కె.మాధవి, జి.ఉమారాణి తదితరులకు కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. బండారి శాంతి కుమార్, భావరిలాల్​వర్మ కోశాధికారులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. నూతన కార్యవర్గంలో సీనియర్ నేతలతో పాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించారు.