Breaking News

చెన్నైలో బాలు అంత్యక్రియలు

ఎస్పీ బాలు భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్​ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే బాలూను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, సినీప్రియులు, తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో తీవ్రమైన ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. అయితే అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని ఫామ్​హౌస్​కు తీసుకెళ్లనున్నారు. మరోవైపు బాలు మృతికి తెలుగు ప్రజలంతా తీవ్ర బాధతప్త హృదయంతో నివాళి అర్పిస్తున్నారు. సోషల్​ మీడియాలో ఆయనకు లక్షలమంది అభిమానులు అశ్రునివాళి అర్పిస్తున్నారు.