Breaking News

బహిరంగ ‘లేఖ’పై రాహుల్​ ఫైర్​

న్యూఢిల్లీ: ఎప్పడు ప్రశాంతంగా ఉండే రాహుల్​ గాంధీ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. సొంతపార్టీలోని సీనియర్​ నేతలను కడిగిపారేశారు. వారిపై తీవ్రకోపం ప్రదర్శించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీడబ్ల్యూసీ (కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ ) సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో పాల్గొన్న రాహుల్​.. 23 మంది సీనియర్లు నేరుగా సోనియాగాంధీకి లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై ఫైర్​ అయ్యినట్టు సమాచారం. ‘సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో మీరు లేఖ ఎందుకు పంపించారు. అసమ్మతి నేతలంతా బీజేపీతో, కాంగ్రెస్​ వ్యతిరేక మీడియాతో చేతులు కలిపారా. మీరు పార్టీని బాగుచేయడానికి ఉన్నారా.. లేక పార్టీ పరువుతీయడానికా’ అంటూ రాహుల్​ సొంతపార్టీ నేతలపై మండిపడ్డారట. రాహుల్​ గాంధీతోపాటు మన్మోహన్​సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఏకే ఆంటోని కూడా ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టినట్టు సమాచారం.