Breaking News

నా బిడ్డ పెండ్లికి రండి

నా బిడ్డ పెండ్లికి రండి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు పనికర మల్లయ్య తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను తీసుకుని హైదరాబాద్​కు వచ్చి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా సోమవారం ప్రగతిభవన్ లో అందజేశారు. వేడుకలకు ముఖ్యమంత్రిని రావాల్సిందిగా కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో నాటి ఉద్యమ సారథి సీఎంను తన కూతురు పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చినట్టుగా పనికిర మల్లయ్య తెలిపారు.