Breaking News

దుబ్బాకలో కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ

సారథిన్యూస్​, సిద్దిపేట: దుబ్బాకలో ఉప ఎన్నికల జరుగుతున్న వేళ కాంగ్రెస్​పార్టీకి షాక్​ తగిలింది. దుబ్బాక నుంచి టికెట్​ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ సీనియర్​ నేతలు నరసింహారెడ్డి, మనోహర్​రావు పార్టీకి గుడ్​బై చెప్పారు. శుక్రవారం వారు మంత్రి హరీశ్​రావు సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరారు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించిన అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. నవంబరు 3న అక్కడ పోలింగ్​ జరుగనున్నది. టీఆర్ఎస్​ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు బరిలో నిలిచారు.