Breaking News

తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి 60,717 కేసుల నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు 13 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 505 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 289 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​18, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల 15, జనగాం 22, జయశంకర్​భూపాలపల్లి 20, జోగుళాంబ గద్వాల 28, కరీంనగర్​97, ఖమ్మం 26, మహబూబ్​నగర్​41, మహబూబాబాద్​39, మంచిర్యాల 18, నల్లగొండ 61, నిజామాబాద్​44, పెద్దపల్లి 21, సిరిసిల్ల 30, సంగారెడ్డి 33, సిద్దిపేట 24, సూర్యాపేట 37, వనపర్తి 23, వరంగల్​అర్బన్​102, భువనగిరి 16 చొప్పున పాజిటివ్​కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మీడియా బులిటెన్​ను విడుదల చేసింది.