Breaking News

తెలంగాణలో 1,178 కేసులు

తెలంగాణలో 1,178 కేసులు,

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,178 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి 9 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తంగా 348 మంది బలయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ ​కేసులు 33,402 కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,62,171 టెస్టులు చేశారు. జీహెచ్​ఎం పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా 125, మేడ్చల్​101, సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్​ 20, కరీంనగర్​24, సిరిసిల్ల 24, మేదక్​16 కేసుల చొప్పున పాజిటివ్​గా తేలాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​ బులిటెన్​ను విడుదల చేసింది.