Breaking News

తెలంగాణలో 1,102 క‌రోనా కేసులు

తెలంగాణలో 1,102 క‌రోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,102 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో పాజిటివ్​కేసుల సంఖ్య 91,361కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 693కు చేరింది. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో 24 గంటల్లో చికిత్స అనంతరం 1,930 మంది కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. అయితే ఇప్పటివరకు పూర్తిగా కోలుకున్నవారు 68,126 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్యధికంగా 234 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా క‌రీంనగ‌ర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చల్​మ‌ల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున‌ ఎక్కువ సంఖ్య పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.