Breaking News

తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 55,532 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 471 మంది మృత్యువాతపడ్డారు. చికిత్స అనంతరం 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,955కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 506 నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 168, వరంగల్​ అర్బన్​111, సంగారెడ్డి 98, కరీంనగర్​ 91, మేడ్చల్​మల్కాజ్​గిరి 84, నిజామాబాద్ ​41, మహబూబాబాద్​ 34, జోగుళాంబ గద్వాల 32, సూర్యాపేట 32, ఆదిలాబాద్ ​28, ఖమ్మం 20, నల్లగొండ 28, నాగర్​కర్నూల్ 19, రాజన్న సిరిసిల్ల 19 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్ ను విడుదల చేసింది.