Breaking News

డిజిటల్​ యుగం.. హుషారు కావాలె

సారథి న్యూస్ రామడుగు: ప్రధాన్​ మంత్రి గ్రామీణ్​ డిజిటల్ సాక్షరతా అభియాన్​ కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఉచితంగా కంప్యూటర్​, డిజిటల్​ లావాదేవీలు, కిసాన్ ​క్రెడిట్​కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు సర్పంచ్​ ఉప్ప రాధమ్మ, ఉపసర్పంచ్​ కనకయ్య, గ్రామ కార్యదర్శి ఝాన్సీ, ఏటీఎంఏ చైర్మన్​ చెరుకు శ్రీనివాస్​రెడ్డి, దిశ ప్రోగాం వీఎల్​ఈ మామిడిపల్లి సుధాకర్​, అనువోజు రవికాంత్​, ఉప్పల అంజనీ ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.