![డయల్ యువర్ జేసీకి 17 వినతులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/WhatsApp-Image-2020-04-24-at-1.06.11-PM.jpeg?fit=1280%2C960&ssl=1)
సారథి న్యూస్, శ్రీకాకుళం: డయల్ యువర్ జేసీ కార్యక్రమానికి 17 వినతులు వచ్చాయి. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు హాజరై జిల్లాలోని పలువురి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సరఫరాల అధికారి జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.