Breaking News

టీడీపీలోకి సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

టీడీపీలోకి సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

  • హయత్​నగర్​లో కార్యకర్తలతో భారీర్యాలీ
  • ఆయన వెంటే పలువురు అనుచరులు

సారథి న్యూస్​, ఎల్​బీ నగర్: హయత్​నగర్​ డివిజన్​కు చెందిన టీఆర్​ఎస్​ సీనియర్​ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన పెద్దసంఖ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ హయత్​ నగర్ డివిజన్ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ ఇన్​చార్జ్​ ఎస్వీ క్రిష్ణప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. హయత్​నగర్​ డివిజన్ కేంద్రంలో టీడీపీ జెండాను ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్​ భవన్​కు భారీ ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్ సింగిరెడ్డి మురళీధర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రొఫెసర్ జ్యోస్న, మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు అశోక్ కుమార్ గౌడ్, మహిళా నాయకురాలు క్రిష్ణవేణి, టీఎన్​టీయూసీ అధ్యక్షుడు ప్రసాద్ బాబాయ్, ప్రధాన కార్యదర్శి వెంకట్ గాంధీ, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ సుభాని, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి రంజిత్ గౌడ్, డివిజన్ సీనియర్ నాయకులు మరాఠి భిక్షపతి, హయత్​ నగర్ ప్రధాన కార్యదర్శి కాటెపాక ప్రవీణ్​కుమార్​, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు తోట్ల శ్రీనివాస్, ఎల్బీనగర్ నాయకులు పిడుగు రవీందర్, డివిజన్ ఉపాధ్యక్షుడు జెంగిలి కుమార్ యాదవ్, జెనిగె అర్జున్ పాల్గొన్నారు.