Breaking News

టీడీపీకి మరో షాక్​


అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది మొదలు.. టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వయస్సు మీదపడటం.. యువనేత లోకేశ్​ మీద పార్టీ నేతలకు నమ్మకం లేకపోవడంతో కీలకనేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్​ టీడీపీకి గుడ్​బై చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చందన రమేశ్​ వైఎస్సార్​సీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు నాగేశ్వర్ కూడా వైఎస్సార్​సీపీలో చేరారు. ఈ సందర్భంగా చందన రమేష్, ఆయన కుమారుడు నాగేశ్వర్‌ను జగన్‌ సాదరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ పాల్గొన్నారు.